ఏపీ డీజీపీకి పోసాని కృష్ణమురళీ ఫిర్యాదు.. !

ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు.టీడీపీ నేత నారా లోకేశ్ వలన తనకు ప్రాణహాని ఉందని పోసాని ఫిర్యాదు చేశారు.

 Complaint Of Posani Krishna Murali To Ap Dgp.. !-TeluguStop.com

లోకేశ్ తో తనకు ప్రాణహాని ఉందని పోసాని ఆరోపించారు.తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.

ఈ క్రమంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్న ఆయన అన్ని విషయాలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.గతంలో టీడీపీలోకి లోకేశ్ తనను ఆహ్వానించారని, ఈ క్రమంలోనే ఆయన పీఏ ద్వారా కలిసే ప్రయత్నం కూడా చేశారన్నారు.

కానీ తాను టీడీపీలో చేరనని చెప్పడంతో తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.లోకేశ్ బండారం మొత్తం బయటపెట్టింది తానేనన్న పోసాని తాను అగ్రెసివ్ గా మాట్లాడతా కాబట్టే చంపాలనుకుంటున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube