ఒత్తిడి.నేటి టెక్నాలజీ యుగంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎందరి పాలిటో ఇది పెద్ద శాపంగా మారింది.పొరపాటును ఒత్తిడిని నిర్లక్ష్యం చేశామా.ఇక అది పెరిగి పెరిగి ప్రాణాలనే హరిస్తుంది.పైగా ఒత్తిడి వల్ల అధిక బరువు, గుండె జబ్బులు, రక్త పోటు, మధుమేహం ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టేస్తాయి.అందుకే ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదని నిపుణులు చెబుతుంటారు.
అయితే ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది తెగ సతమతమవుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ను పాటిస్తే ఒత్తిడిని సులభంగా నివారించుకోవచ్చు.
మరి లేటెందుకు ఒత్తిడిని నివారించే ఆ సూపర్ ట్రిక్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.దాదాపు అందరూ వారంలో రెండు లేదా మూడు సార్లు తల స్నానం చేస్తూనే ఉంటాయి.
అయితే వేడి నీటితో తల స్నానం చేశాక.చివర్లో చల్లటి నీటిని ముప్పై లేదా నలబై సెకెండ్ల పాటు తలపై పోసుకోవాలి.
చివర్లో ఇలా చల్లటి నీటిని తలపై పోసుకోవడం వల్ల శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి.
అవి ఒత్తిడిని చిత్తు చేసేస్తాయి.మనసును ప్రశాంతంగా, తేలిగ్గా మార్చేస్తాయి.ఆందోళన, తల నొప్పి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను దూరం చేస్తాయి.
మరియు మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచుతాయి.ఒక వేళ మీరూ ఒత్తిడితో బాధ పడుతుంటే ఖచ్చితంగా ఈ ట్రిక్ను ట్రై చేయండి.
ఇక వేడి నీటితో స్నానం చేసిన తరువాత చివర్లో చల్లటి నీటిని అర నిమిషం పాటు ఒంటిపై పోసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.తీవ్రమైన కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరియు శరీరం రోజంతా ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా పని చేస్తుంది.
.