తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )మొదటి స్థానంలో ఉంటాడు.ఈయన చేయడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేయాలని చూసింది.కానీ ఆయన వాళ్ళందరిని తట్టుకొని వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఈయన తో పాటుగా నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి నటులు కూడా మంచి విజయాలను అందుకుంటూ ఆయనకి సపోర్టుగా నిలిచారు…ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాతమ్మ పెళ్లి( Tatamma pelli ) అనే సినిమా చేసినప్పుడు అందులో హీరోయిన్ గా భానుమతి( Bhanumati ) గారిని అనుకున్నారు.
అయితే ఆ సినిమా రైటర్ అయిన డి వి నరసరాజు భానుమతి దగ్గరికి వెళ్లి మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అని అడిగాడట.
దాంతో ఆమె ఎన్టీఆర్ కి ఎంత రెమ్యూన రేషన్ ఇస్తున్నారో దానికి ఒక 5000 తగ్గించి నాకు ఇవ్వండి అని చెప్పిందంట.ఇక ఈ విషయాన్ని నరసరాజు ఎన్టీఆర్ కి చెప్పాడట…ఎన్టీఆర్ అప్పటికే 4 నుంచి 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్ నరసరాజుతో తను రెండు లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్టుగా చెప్పి, ఆమెకి లక్ష 90 వేలు ఇవ్వండి అని చెప్పాడట.
దాంతో నరసరాజు భానుమతి దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ రెండు లక్షలు తీసుకుంటున్నాడు.మీరు లక్ష 90 వేలు తీసుకోండి అని చెప్పాడట.దాంతో ఆమె ఎన్టీఆర్ రెండు లక్షలే తీసుకుంటున్నాడా అయితే దానికి ఇంకో 5000 కలిపి నేను ఎన్టీఆర్ కి ఇస్తాను.
నా నెక్స్ట్ సినిమాలో ఆయన్ని యాక్ట్ చేయమని చెప్పండి అని చెప్పిందట.ఇక ఇదే విషయాన్ని నరసరాజు ఎన్టీఆర్ కి చెప్తే మన సినిమాలో తీసుకోవడానికి రెమ్యూనరేషన్ అడిగితే నన్ను తన సినిమాలో యాక్టింగ్ చేయమంటుందా అని ఎన్టీఆర్ ఒకసారి షాక్ అయ్యాడంట.ఒప్పుకున్న దానికి చేయక తప్పదు.
కాబట్టి ఎన్టీఆర్, భానుమతి చేసిన ‘అమ్మాయి పెళ్లి ‘( Ammay pelli ) సినిమాలో నటించడం తో ఇద్దరికీ మంచి గుర్తింపు అయితే లభించింది…
.