మరి కాసేపటిలో కేంద్ర మంత్రిమండలి విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది.త్వరలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో చివరి మంత్రిమండలి భేటీ ఇదే కానుంది.
ఈ మేరకు ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్ ( Sushmaswaraj Bhavan ) లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) భేటీ కానున్నారు.ఇందులో ప్రధానంగా ఎన్నికల సన్నద్ధత, సన్నాహాలపై చర్చించనున్నారు.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రోడ్ మ్యాప్, విజన్ పై సమావేశంలో చర్చించనున్నారు.అదేవిధంగా విజన్ ఇండియా -2047 ( Vision India -2047 ) అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.దాంతోపాటుగా కేబినెట్ మంత్రులు అందరూ తమ తమ మంత్రిత్వ శాఖల రోడ్ మ్యాప్ పై వివరణ ఇవ్వనున్నారని సమాచారం.
కాగా ఈ మంత్రిమండలి సమావేశంలో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు.