కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బస్సు కోసమో, రైలు కోసమో రిజర్వేషన్ చేయించుకోలేదు.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
మహిళలకు సంబంధించి జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి అన్ని పోలీసు స్టేషన్లలో మహిళా పోలీసులు ఉండాలన్నారు.మహిళలకు పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా అవసరమని, ఈ పని చేయకపోతే మహిళలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావని మేనకా గాంధి అన్నారు.
గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేశారని చెప్పారు.రిజర్వేషన్ విషయమై కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు.
మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు.మేనకా గాంధీ చెప్పింది వాస్తవమే.
అయితే పోలీసు శాఖలో ఇప్పటకీ మగవారి ఆధిపత్యమే కొనసాగుతున్నది.ఐ పీ ఎస్ అధికారులను తప్ప మిగిలిన మహిళా పోలీసు అధికారులను అంతగా ఖాతరు చేయడంలేదు.
పోలీసు కానిస్టేబుళ్ల పరిస్థితి దారుణంగా ఉంది.