1980లలో చిరంజీవి, విజయశాంతిల కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.హిట్ పెయిర్గా వీరిద్దరి జోడికి పేరు వచ్చింది.
చిరంజీవి అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్స్లో విజయశాంతి ముందు ఉంటుంది.ఆ తర్వాత తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బిజీ అయ్యింది.లేడీ అమితాబచ్చన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ సమయంలోనే ఈమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
ఇక చిరంజీవి కూడా రాజకీయాల వల్ల గత ఎనిమిది సంవత్సరాలుగా సినిమాల్లో నటించిందే లేదు.
వచ్చే నెలలో చిరంజీవి 150వ సినిమా ప్రారంభం కాబోతుంది.
అదే సమయంలో విజయశాంతి కూడా తన సినీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.ఈమె ప్రస్తుతం కథలు వింటున్నట్లుగా సమాచారం అందుతోంది.
దేశ భక్తి నేపథ్యంలో సినిమాను తెరకెక్కించాలని విజయశాంతి కోరుకుంటుంది.ఆ సినిమాకు స్వయంగా తానే దర్శత్వం వహించాలని విజయశాంతి భావిస్తోంది.
ఇక ఆ సినిమాను చిరంజీవి 150వ సినిమా విడుదల సమయంలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా కూడా విజయశాంతి ఆమె సన్నిహితులతో చెబుతోంది.మరి చిరంజీవి మెగా పవర్ ముందు విజయశాంతి నిలుస్తుందో చూడాలి.