ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నారా? రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు విపరీతంగా కొట్టుకుంటున్నా ఆయన ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు.కేంద్రం ఆంధ్రకు అన్యాయం చేస్తోందని అక్కడి నాయకులు గగ్గోలు పెడుతున్నా ఏం మాట్లాడలేదు.
నోటుకు ఓటు వ్యవహారంలో ఎవరిది తప్పో, ఎవరిది రైటో చెప్పలేదు.నాయకులను నిలదీసి ప్రశిస్తానన్న పవర్ స్టార్ ఆ పనే చేయలేదు.‘నువ్వు ఎందుకు మాట్లాడటంలేదు?’ అని పవన్ను అనేకమంది చాలా కాలంగా ప్ర శ్నిస్తున్నారు.చివరకు వివాదాల దర్శకుడు రాంగోపాల వర్మ కూడా పవన్ను ప్రశ్నించారు.
ఇక లాభం లేదనుకున్న పవన్ కళ్యాణ్ కేసీఆర్, చంద్రబాబు నాయుడిలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలని అనుకున్నారేమో…! చివరకు బాబుకు మద్దతు ఇచ్చారు.మద్దతు ఇచ్చారా? బాబుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు కదా.మీడియాలో మాట్లాడలేదు కదా.ట్విట్టర్లో పోస్టు చేయలేదు కదా….ఇలా అనేక సందేహాలు కలుగుతన్నాయి.అయితే పవన్ మాటలతో కాదు, మామిడ పండ్లతో మద్దతు ఇచ్చారట.అవునండీ….ఆయన వ్యవసాయక్షేత్రంలో కాసిన మామిడిపండ్లను చంద్రబాబుకు పంపారట.
ఇష్టమైనవారికి పండ్లు పంపుతాం కదా.ఎవరికిబడితే వారికి ఇవ్వం కదా.బాబుకు మామాడి పండ్లు పంపాడు కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు అనుకోవాలి మరి.మర్యాద కోసం కేసీఆర్కు కూడా పంపుతాడేమో.అప్పుడు ఇత తటస్థంగా ఉన్నట్లా?
.