ప్రపంచంలో మన తెలుగు వారు ఎక్కడున్నా సరే కచ్చితంగా జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ( Ugadi festival ) మొదటి స్థానంలో ఉంటుంది.ఉగాది రోజున బంధుమిత్రులందరూ కలిసి ఇంట్లో ఉండి ఉగాది పచ్చడి తోపాటు దేవుడి కార్యక్రమాలు పూర్తిచేసుకుని అందరూ సంతోషంగా గడుపుతారు.
ఏప్రిల్ 9న భారతదేశంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా తెలుగు ప్రజలు జరుపుకున్న విషయం తెలిసింది.ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వ్యక్తులు కూడా ఉగాది పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.
ఏ దశనికి వెళ్లిన మన దేశ సంస్కృతులను మర్చిపోకుండా తెలుగువారు చాలామంది వారి పండుగలను విదేశాల్లో కూడా జరుపుకుంటూ వేరే దేశాల వరకు కూడా మన సంస్కృతిని తెలియజేస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా దక్షిణాఫ్రికాలోని బర్గ్ నగరంలో ( Burgh, South Africa) ఉగాది వేడుకలను పెద్ద ఎత్తున చేశారు.ఈ వేడుకలను కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా( Consulate General of India, Andhra Pradesh Association of South Africa ) వారి ఆధ్వర్యంలో తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ప్రతి ఏడాది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా వారి శక్తివంచన లేకుండా ఉగాది ఉత్సవాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కార్యవర్గ స్పూర్తిని ‘జోహనెస్ బర్గ్ ‘ ప్రత్యేకంగా అభినందించింది .ఇక ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ కొప్పురాజు తమ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలను చేస్తుండడం లాంటి విశేషాలను వివరించారు.ఇక ఉగాది సందర్భంగా వారు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.