తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కేసీఆర్ కారు టైర్లు పంక్చర్ అయ్యాయని భట్టి విక్రమార్క విమర్శించారు.బీఆర్ఎస్ ను కానీ, కేసీఆర్ ను కానీ ప్రజలెవరూ ప్రస్తుతం నమ్మే స్థితిలో లేరన్నారు.
ఈ క్రమంలో వచ్చే నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.