తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటుడు శ్రీహరి( Srihari ) ఒకరు.ఈయన ఎన్నో సినిమాలలో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
అలాగే పలు సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు.ఇక హీరోగా ఈయనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో హీరోలకు హీరోయిన్లకు అన్నయ్య బాబాయ్ పాత్రలలో నటించి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.
అయితే ఉన్నఫలంగా ఈయన అనారోగ్య సమస్యలకు గురికావడం ఆకస్మికంగా మరణించడం జరిగింది.
ఇలా శ్రీహరి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈయన మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇక శ్రీహరి నటి డిస్కో శాంతి( Disco Shanthi ) ని పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.ఇక శ్రీహరి మరణం తర్వాత తన కుటుంబం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంది అంటూ డిస్కో శాంతి పలు సందర్భాలలో శ్రీహరి మరణం తర్వాత తాము ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి తెలియజేశారు.
ఇక శ్రీహరి మరణం గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
బావకు రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లే చనిపోయారని ముంబైలో కాకుండా హైదరాబాద్లో అయితే కచ్చితంగా బావ బతికేవారు అంటూ కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా తాజాగా శ్రీహరి డిస్కో శాంతి సంతానం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పుడు మాత్రం వీరిద్దరికి ఇద్దరు కుమారులు అన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు కానీ ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారనే విషయం చాలామందికి తెలియదు.
డిస్కో శాంతి శ్రీహరి దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారట ఆ చిన్నారి పేరు అక్షర( Akshara ).
ఈ చిన్నారి జన్మించినటువంటి నాలుగు నెలలకే మరణించడం గమనార్హం.ఇలా నాలుగు నెలల వయసులోనే అక్షర మరణించడంతో శ్రీహరి తన కూతురు పేరు మీదగా తన కూతురి గుర్తుగా ఈయన అక్షర ఫౌండేషన్( Akshara Foundation ) స్థాపించారు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా శ్రీహరి ప్రారంభించారని తెలుస్తోంది.ఇక చాలా గ్రామాలు ఫ్లోరైడ్ నీటితో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అయితే శ్రీహరి ఉన్న సమయంలో ఈ అక్షర ఫౌండేషన్ ద్వారా ఎన్నో గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని సరఫరా చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.ఈ విధంగా శ్రీహరి గారికి కూతురు ఉన్నారని ఆమె చనిపోవడంతోనే ఈ ఫౌండేషన్ స్థాపించారనే విషయం చాలా మందికి తెలియదు.
అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి గొప్ప పనులు గురించి ప్రచారం చేసుకోకపోవడం నిజంగా గొప్ప వ్యక్తుల లక్షణం అంటూ మరోసారి శ్రీహరి గారిని గుర్తు చేసుకుంటున్నారు.