కారును 300 మీటర్ల మేర లాక్కెళ్ళిన ట్రక్కు డ్రైవర్.. షాకింగ్ వీడియో వైరల్..

సికందర్‌పూర్ పట్టణం సమీపంలో ఆగ్రా-ముంబై హైవేపై( Agra-Mumbai Highway ) ఓ దారుణం చోటు చేసుకుంది.అమర్ జైన్, కవితా జైన్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ఈ హైవేపై ప్రయాణిస్తుండగా వారిని ట్రక్కుతో( Truck ) ఒక డ్రైవర్ గుద్దేశాడు.

 Truck Dragged The Car For Three Hundred Meters On The Highway Viral Video Detail-TeluguStop.com

ఈ షాకింగ్ ఘటనలో మహిళకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ కారును ఈడ్చుకెళ్లడానికి ప్రధాన కారణం ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడమేనని తెలిసింది.

వివరాల్లోకి వెళితే తాజాగా ఆగ్రా-ముంబై హైవేపై ఓ ట్రక్కు కారును ఢీకొట్టింది.ఆపై ట్రక్కు డ్రైవర్ కారును( Car ) దాదాపు 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు.కారులో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు సహా నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు.ప్రయాణికులకు గాయాలు కాగా, మహిళ తీవ్రంగా గాయపడింది.ప్రస్తుతం వారు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.స్థానికులు కేకలు వేసినా, ట్రక్కుపై రాళ్లు రువ్వినప్పటికీ ట్రక్ డ్రైవర్ కారును ఈడ్చుకెళ్తూనే ఉన్నాడు.

చివరకు పోలీసులు జోక్యం చేసుకుని డ్రైవర్‌ను బలవంతంగా పక్కకు లాగడంతో లారీ ఆగిపోయింది.

ట్రక్కు డ్రైవర్‌తో ( Truck Driver ) పాటు ట్రక్కుపై ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ప్రమాదంలో డ్రైవర్‌ భయపడి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.కారు డ్రైవర్ అమర్ జైన్( Amar Jain ) ట్రక్కును ఓవర్ టేక్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఆ తర్వాత లారీ డ్రైవర్‌ కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు.ఈ ఘటనపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.ట్రక్కు డ్రైవర్, ట్రక్కుపై ఉన్న ఇతర వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube