అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.మీ అవిశ్వాసం ప్రజలపైనా అని ప్రశ్నించిన అమిత్ షా ప్రజల ఆలోచనలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నామని తెలిపారు.
ప్రజలకు తమపై పూర్తి నమ్మకం ఉందని అమిత్ షా వెల్లడించారు.సర్కారు సరిగా పని చేయనప్పుడు విపక్షాలు అవిశ్వాసం పెడతాయని పేర్కొన్నారు.
సర్కారు సరిగా పని చేయనప్పుడు విపక్షాలు అవిశ్వాసం పెడతాయన్నారు.ఇప్పటివరకు 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయని తెలిపారు.
అవిశ్వాస తీర్మానంతో ప్రజల్లో భ్రాంతి సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల మద్ధతు లేదని చెప్పారు.ప్రధానిపై, కేంద్రంపై ప్రజలకు విశ్వాసం ఉందని తెలిపారు.30 ఏళ్ల తరువాత సంపూర్ణ మెజార్టీతో ఏర్పడిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు.