సినీ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.గతంలో జరిగిన మా ఎన్నికలలో భాగంగా ఈయన ప్రకాష్ రాజ్ ( Prakash Raj ).
పై పోటీచేసి విజయం సాధించారు.అయితే ఈ ఎన్నికల సమయంలో ఇవి మా ఎన్నికల లేకపోతే సాధారణ ఎన్నికల అనేలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు.దీంతో మంచు ఫ్యామిలీపై నాగబాబు సైతం పలు వ్యాఖ్యలు చేశారు.
ఇలా ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా సాధారణ ఎన్నికలను తలపించిన మా ఎన్నికలలో( Maa Elections ) మంచు విష్ణు గెలుపొందారు.అయితే ఎన్నికల జరిగిన తీరు సవ్యంగా లేదంటూ ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన పానల్ సభ్యులందరూ కూడా రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే.త్వరలోనే మా ఎన్నికలు రానున్న నేపథ్యంలో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సినీ కార్మికుల కోసం ఈయన ఉచితంగా మెడికల్ క్యాంప్( Free Medical Camp ) నిర్వహించారు.

ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ.” మెడికవర్ హాస్పిటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము.మొత్తం 914 మంది సభ్యులకు వివిద రకాల మాస్టర్ హెల్త్ చెకప్( Master Health Checkup ) లు చేశారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఉచితంగా హెల్త్ చెకప్స్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ అవకాశాన్ని కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇకపోతే వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో మా ఎన్నికలు జరగబోతున్నాయి.మరి ఈ ఎన్నికలలో కూడా విష్ణు పోటీ చేస్తారా అన్న విషయం గురించి ప్రశ్నలు తలెత్తడంతో ఆయన వచ్చే మా ఎన్నికలలో( Maa Elections ) తాను అసలు పోటీకి దిగడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
ఇలా ఎన్నికలలో విష్ణు పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.