ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.ఈ క్రమంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా వచ్చినట్లు తెలుస్తోంది.
కౌంటింగ్ లో ఆరు రౌండ్లు ముగిసేసరికి సుమారు 20 వేల చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.అయితే చెల్లని ఓట్లలో ఎక్కువ వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి పడినవేనని సమాచారం.