మద్రాస్ కాఫీ అనే హిందీ సినిమా తో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశి కన్నా ఆ తర్వాత తెలుగు సినిమా మనం లో చిన్న పాత్ర లో కనిపించింది.ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా పూర్తి స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రాశి కన్నా కి మంచి గుర్తింపు లభించింది.అప్పటి నుండి వరుసగా జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవకుశ అంటూ చాలా సినిమాలని చేసింది.
అన్ని సినిమా లు చేసినా కూడా ఈ అమ్మడి యొక్క స్టార్ డమ్ పెరగలేదు.టైర్ 2 హీరోలకు మాత్రమే ఈమె వాంటెడ్ అయ్యింది.
వాటిల్లో కొన్ని సినిమాలు నిరాశ పర్చగా కొన్ని మాత్రం పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి.ఒకానొక సమయంలో ఈ అమ్మడి యొక్క బరువు గురించి తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
తమిళ సినిమా లకు అయితే పర్వాలేదు కానీ తెలుగు లో ఇంత వెయిట్ ఉన్న హీరోయిన్స్ ను ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోరు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.దాంతో కష్టపడి దాదాపుగా పది కేజీల బరువును ఈమె లాస్ అయ్యి చూపించింది.బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాకుండా అందాల విందు చేయడంలో ముందు ఉంటుంది.అయినా కూడా ఈమెను స్టార్ ఫిల్మ్ మేకర్స్ మరియు హీరోలు పట్టించుకోలేదు.దాంతో ఈ అమ్మడి యొక్క కెరీర్ చాలా డల్ గా సాగుతూ వచ్చింది.కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా చిన్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది.
ఒకే ఒక్క సారి స్టార్ హీరో ఎన్టీఆర్ తో నటించింది.కానీ ఆ సినిమా లో మరో ఇద్దరు హీరోయిన్స్ ఉండటం వల్ల ఈమెకు రావాల్సిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.ప్రస్తుతం కెరీర్ లో బిజీగా కనిపించడం లేదు.తెలుగు లో ఈ అమ్మడు పెద్దగా నటించడం లేదు.ఇతర భాషల్లో కాస్త సినిమాలు చేస్తోంది.టాలీవుడ్ కెరీర్ ఖతం అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.