టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.గత ప్రభుత్వం తప్పుల వలనే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.కాఫర్ డ్యామ్ పనులను పట్టించుకోలేదన్నారు.
వైసీపీ సర్కార్ వచ్చిన తరువాతనే కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచామని తెలిపారు.ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా రాష్ట్ర నిధులను ఖర్చూ చేస్తూ పనులను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అంబటి టీడీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.