టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా ‘1 నేనొక్కడినే’సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఢిల్లీ బ్యూటీ కృతి సనన్.ఈమె మహేష్ బాబుతో కలిసి ఈ సినిమాలో నటించినా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ఈ సినిమా అనంతరం అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన దోచేయ్ సినిమాలో నటించారు.ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నారు.
ఇకపోతే చాలా సంవత్సరాలు తర్వాత ఈమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.అయితే అంతకుముందే ఈమె తోడేలు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.
వరుణ్ ధావన్ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా క్రీచర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని నవంబర్ 25వ తేదీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
తెలుగులో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సమర్పణలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం హైదరాబాదులో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కృతి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరు అనీ ప్రశ్నించగా ఈమె తన కో స్టార్ ప్రభాస్ అంటే తనకు ఇష్టము అంటూ కామెంట్ చేశారు.
అదేవిధంగా తనకు తెలుగులో పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు తనకి బాగా నచ్చాయని తెలిపారు.అయితే గతంలో కృతిసనన్ ప్రభాస్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే ఈమె తనకు ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పడం గమనార్హం.