రాజస్థాన్లోని బార్మర్లోని ఓ డెంటల్ క్లినిక్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.ఆ క్లినిక్లో న్యూస్ పేపర్ చదువుతూ 60 ఏళ్లకు పైబడిన ఓ వ్యాపారవేత్త కుప్పకూలి మరణించాడు.
అతడు క్లినిక్లోకి రావడం, ఒక బల్లపై కూర్చోవడం, న్యూస్ పేపర్ తీసుకొని చదువుకోవడం వంటి దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి.అయితే ఈ క్లిప్ చివరిలో అతడు ఉన్నట్లుండి ఒకసారిగా కింద పడిపోయాడు.కొందరు వ్యక్తులు వచ్చి అతని లేపారు.
కాగా ఈ దృశ్యాలకు సంబంధించి ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మృతుడు దిలీప్ కుమార్ మదానీగా గుర్తించారు.అతను పంటి నొప్పి గురించి డెంటిస్ట్ని కలుసుకునేందుకు వచ్చాడు.
అయితే క్లినిక్లో వైద్యుడిని కలవడానికి ముందే అతను కుప్పకూలిపోయాడు.ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఈ వృద్ధుడు ఇలా హఠాన్మరణం చెందడానికి కార్డియాక్ అరెస్ట్ కారణం కావచ్చు అని అభిప్రాయపడుతున్నారు.అయితే కింద పడిపోయిన వెంటనే అతడికి సీపీఆర్ చేయకుండా ఆసుపత్రి సిబ్బంది తప్పు చేసిందని వీడియో చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు.
వీడియోలో, మదానీ అకస్మాత్తుగా నేలపై పడిపోయే ముందు వార్తాపత్రిక చదువుతున్నట్లు చూడవచ్చు.ఫ్రంట్ డెస్క్ సిబ్బంది అతని వైపు పరిగెత్తడం చూడవచ్చు.క్లినిక్లోని వైద్యులు కూడా అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించారు.తరువాత నహతా ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.ఇలాంటి సంఘటనలు ఈ రోజుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.చాలామంది గుండెపోటు వచ్చి ఊహించని రీతిలో చనిపోతున్నారు.
ఈ క్రమంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు.