ప్రెసెంట్ టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు.కొత్త కొత్త విషయాలు అమలు లోకి రావడమే కాదు.
కొన్ని పాత విషయాల్లో కూడా కీలక మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.ఇక షూటింగ్ ల విషయంలో సినీ పెద్దలు అందరు సమావేశం అయ్యి పరిస్థితులను చక్కబెట్టడానికి చూస్తున్నారు.
ఓటిటి ల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కు రావడానికి వెనకడుగు వేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అందరు నిర్మాతలు కూడా తమకు నష్టాలు తప్పడం లేదని షూటింగ్ లను బంద్ పెట్టారు.
దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది.ఈ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకో బోతున్నాయిట.
ఈ క్రంమలోనే తాజాగా మా ప్రెసిడెంట్ ను టాలీవుడ్ అగ్ర ప్రొడ్యూసర్ దిల్ రాజు మీట్ అయ్యారు.
ఈ విషయాన్నీ స్వయంగా మంచు విష్ణు తెలిపారు.
గత ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ను ఓడించి మా అధ్యక్ష పదవిని చేపట్టిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈయనను దిల్ రాజు కలిశారు.
అందుకు కారణం ఏంటో కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.దిల్ రాజుతో భేటీ అవ్వడానికి కారణం కూడా తెలిపారు.
విష్ణు చేస్తూ.‘మా’ తరపున టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ ను కలవడం స్టార్ట్ చేసాం అని.మా సభ్యులను ఎక్కువగా నియమించుకోవాలని.కొత్త వారిని మా కుటుంబం లోకి భాగం చేయడానికి ప్రోత్సహించాలని వారిని కోరాము.
అంటూ విష్ణు తెలుపుతూ దిల్ రాజు తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసాడు.మరిన్ని డిటైల్స్ త్వరలోనే తెలియనున్నాయి.ఇక మంచు విష్ణు సినిమాల విషయానికి వస్తే.
విష్ణు చివరగా మోసగాళ్లు సినిమాతో వచ్చి ప్లాప్ అందుకున్నాడు..ఇషాన్ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమాతో పాటు.
శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ డబల్ డోస్ సినిమాలు చేస్తున్నాడు.ఈ రెండు సినిమాల్లో ఏదొక సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.
అలాగే దిల్ రాజు కూడా భారీ సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు.