టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీ పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు.ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ మళ్లీ ఇప్పుడు బలం పుంజుకునేలా నేతలు కృషి చేయాలని.
టీటీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.ఈ నెల 25వ తారీకు నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిజిటల్ టీడీపీ మెంబర్ షిప్ నిర్వహించాలని పార్టీ నేతలకు బాబు తెలియజేయడం జరిగింది.
హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ నేతలతో బాబు సమావేశమైన సమయంలో సరికొత్త ఆదేశాలు జారీ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి.
తలుచుకుంటే ఎంతగానో సంతృప్తినిచ్చిందని బాబు స్పష్టం చేశారు.ఇక తన తర్వాత తెలంగాణలో వచ్చినవాళ్లు అభివృద్ధి చెడగొట్ట లేదు కాబట్టే.
అభివృద్ధి నిలబడింది.ఇప్పటికి మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో చెడగొట్టారు కాబట్టే.పతనావస్థకు చేరుకుందని మండిపడ్డారు.
ఈనెల 25వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని తెలిపారు.వంద రూపాయలు చెల్లిస్తే.
రెండు లక్షల భీమా పథకం వర్తిస్తుందని నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.పార్టీ విధానాలు నచ్చిన వారికి డిజిటల్ విధానంలో సభ్యత్వం ఇచ్చే విధంగా సరికొత్త క్యూఆర్ కోడ్ తీసుకురావడం జరిగిందని .ఈ కార్యక్రమాన్ని నేతలంతా విజయవంతం చేయాలని బాబు సూచించారు.