ఏపీ టీడీపీ నేత చంద్రబాబునాయుడు ఫుల్ జోష్లో ఉన్నట్టు కనబడుతోంది.ఆయనలో కొత్తకళ సంతరించుకున్నట్టుంది.
అధికారం పోయిన మూడేండ్ల తరువాత ఆయన ధీమాగా కనిపిస్తున్నారు.ఎందుకంటే ఏ సమావేశంలోనైనా, చివరికి మీడియా ముందు సైతం ఆయన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు.
ఇందుకిలా మారాడనే ప్రశ్న మదిని తొలిచి వేస్తుంది ? అంటే ప్రజల్లో రోజురోజుకు వైసీపీ పట్ల వ్యతిరేకత అధికమవుతోంది.ఆ సమాచారం కూడా బాబు వద్ద ఉందట.
ప్రతి రెండుమూడు నెలలకోసారి ఏపీ పరిస్థితుల గురించి బాబు సర్వే చేయించి తెలుసుకుంటున్నాడట.ఆరునెలల సర్వే రిపోర్టు చూస్తే వైసీపీ పట్ల వ్యతిరేక ఉందని వచ్చిందట.దీనికి తోడు అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు కూడా జగన్కు చెంపపెట్టులా మారింది. ఏపీ అభివృద్ధి విస్మరించి మూడు రాజధానులు అంటూ ముక్కలు చేసేందుకు యత్నించారని, అది కూడా తేటతెల్లమైపోయిందని టీడీపీ భావిస్తోందట.
జనాల నుంచి వచ్చే వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని ముందుకు వెళ్లాలలని బాబు యత్నిస్తున్నట్టు తెలిసింది.ఇదే సమయంలో వివిధ వర్గాలతో ప్రభుత్వ పేచీలు కూడా వికటించడం టీడీపీకి కలిసొచ్చే అంశం.
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ గెలుపు సునాయసంగా మారుతుందని బాబు ధీమాగా ఉంటున్నారట.
గతంలో టీడీపీ చెబితే ప్రజలు నమ్మే పరిస్థితులో లేరు.అయితే జగన్ మూడేండ్ల పాలన తరువాత ప్రజలు విసిగివేసారి పోయారని, ఈ సారి చెప్పాల్సిన పని లేదనే భావనలో బాబు ఉన్నారట.ప్రజా వ్యతిరేకతే బాబును సీఎం సీటులో కూర్చోబెడుతుందని తెలుగు తమ్ములు ఆకాంక్షిస్తున్నారు.
ఇక రాబోయేది టీడీపీ ప్రభుత్వమనే ధీమాలో బాబు ఉన్నాడని, అందుకే కొత్తకళ కనబుతోందని పలువురు పేర్కొంటున్నారు.అయితే బాబులో జోష్ పెరిగితే మంచిదే.కానీ, అతి ధీమా కూడా సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఎన్నికలనేవి ఒక్క ఓటుతో తారుమారవుతాయి.
గుణపాఠాలు చెబుతాయి,.అందుకు పార్టీ క్యాడర్ను కూడా అందుకు సిద్ధంగా చేయాలని చెబుతున్నారు.
ప్రజాక్షేత్రంలో విస్తృత పర్యటనలు చేయాల్సిన అవరం ఉంది.ఏది ఏమైనా రాబోయే సీఎం చంద్రబాబేననే టాక్ వినిపిస్తోంది.
మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే మరి.