టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్ లను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది.
అంతేకాకుండా టాలీవుడ్ లో హీరోయిన్స్ లో ఎక్కువగా బిజీ గా ఉండే హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే, మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తనకు సమయం దొరికినప్పుడల్లా వెకెషన్ లను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
పూజా హెగ్డే ఎంత బిజీ అయ్యింది అంటే ఆమె తో ఫోన్ లో మాట్లాడాలి అన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే.ఇకపోతే ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
అలాగే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన విషయం తెలిసిందే.పూజా హెగ్డే సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ గ్యారెంటీ అన్నంతగా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుండటంతో ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడటం లేదు.
పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ సినిమా ఈనెల 11న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న పూజా.ఓ ఇంటర్వ్యూలో.ఏ హీరోలతో నటించాలి అనుకుంటున్నారు అని అడగగా కమల్హాసన్, రణ్బీర్ కపూర్, ధనుష్లతో నటించాలనుకుంటున్నట్లు తెలిపింది.
ఇప్పటికే కోలీవుడ్లో బీస్ట్ మూవీతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.మరొకవైపు పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఆచార్య సినిమా లో రామ్ చరణ్ సరసన నటించిన విషయం తెలిసిందే.