గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం వద్ద శుక్రవారం పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడానికి వచ్చిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని.ఇద్దరు వ్యక్తులు సంయుక్తంగా దొంగతనానికి పాల్పడ్డారు.
బాదాతులనుండి ముప్ఫై ఐదు వేల రూపాయలును దొంగిలించారు .ఈ సంఘటన పై మంగళగిరి రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబడిని సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి ఇద్దరులో ఒకరిని అరెస్ట్ చేసామని మరొక వ్యక్తి పరారీలో ఉన్నారన్నారు.
త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని తెలియజేశారు ఆశ్చర్యకరంగా దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు కూడా తండ్రీకొడుకులే.ఇరువురు తాడేపల్లి ఈ ప్రాంతానికి చెందిన వారు.
వీరి వద్దనుండి 30 వేల రూపాయలు రికవరీ చేశామని మిగిలిన ఐదు వేల రూపాయలు పరారీలో ఉన్న వ్యక్తి వద్ద ఉన్నాయని సాధ్యమైనంత త్వరగా అతన్ని కూడా పట్టుకుంటామని తెలియజేశారు.