మెగాస్టార్ చిరంజీవి సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు అన్న సంగతి తెలిసిందే.కరోనా లాంటి కష్టకాలంలో లాక్ డౌన్ టైం లో సినీ కార్మికులకు ఎంతగానో సొంత ఖర్చుతో సేవలందించారు.
ఆ తర్వాత ఇండస్ట్రీ తరపున కూడా సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.ఇదే సమయంలో ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీకి వచ్చే సమస్యల విషయంలో కూడా చిరంజీవి తనదైన శైలిలో పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు.
ఇదిలావుంటే ఇటీవల కరోనా బారినపడటం తర్వాత కోలుకోవటం జరిగింది.
కరోనా నుండి రీసెంట్ గా కోలుకున్న చిరంజీవి తన వీరాభిమాని కుమార్తె పెళ్ళికి బిగ్ హెల్ప్ చేశారు.
రాజం కొండల్ రావు అనే వ్యక్తి చిరంజీవికి ఎప్పటినుండో అభిమాని.కాగా రాజం కొండల్ రావు కుమార్తె నీలవేణి వివాహంకి సంబంధించి శుభలేఖ చిరంజీవి కి ఇచ్చి.
పెళ్లికి ఆహ్వానించడం జరిగింది.ఈ తరుణంలో కొండలరావుకి కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం చిరంజీవి లక్ష రూపాయలు అందజేయడం జరిగింది.
అంతేకాకుండా కుమార్తె కి తన ఆశీస్సులు కూడా అందిస్తున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు.చిరంజీవి చేసిన ఈ హెల్ప్ గురించి అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.