సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అతడి పేరు మార్మోగిపోతోంది.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు అయిన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఈడీ అధికారుల సమక్షంలో ఉన్నాడు.ఇతని కేసు విషయంలో రోజురోజుకి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇతని కేసు విషయంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.జాక్వెలిన్ తాను నటించిన సినిమాల కంటే సుకేష్ చంద్రశేఖర్ విషయంలో ఎక్కువగా హైలెట్ అవుతుంది.
రాన్ బాక్సీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ దగ్గర నుంచి 200 కోట్లు వసూలు చేసి ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని మోసం చేశాడు అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతడికి సపోర్ట్ చేసిన అతని భార్య లీనా మారియాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.అతడిని తీహార్ జైలుకు తరలించారు.
అతడిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.బాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖులను మోసం చేయగా.
అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఉన్నారు.ఆమెకు సుకేష్ మాయమాటలు చెప్పి నమ్మించి, కోట్లు విలువ చేసే బహుమతులను ఇచ్చి, ఐదు వందల కోట్ల బడ్జెట్ తో జాక్వెలిన్ హీరోయిన్ గా తీసుకుంటానని నమ్మించాడట.
భారత్ లోనే తొలి మహిళా సూపర్ హీరో ప్రాజెక్ట్ అని, ఇందులో బాలీవుడ్ కి చెందిన వీఎఫ్ఎక్స్ ఆర్టీస్టులు పనిచేస్తారని దానిని మూడు పార్ట్స్ గా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను విడుదల చేస్తామని ఆమెకు మాయమాటలు చెప్పి, బాలీవుడ్ యాక్టర్స్ ఏంజలీనా జోలితో పోల్చటం ఇలా ఆమెను నమ్మించాడట.అలా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుకేష్ వలలో పడిపోయిందని స్పష్టంగా అర్థం అవుతోంది.అంతేకాకుండా అతడిని కలిసేందుకు తీహార్ జైలుకీ తరచూ వెళ్లేదని తెలుస్తోంది.ఈ విషయంలో ఈడి సమన్లు జారీ చేస్తూ జాక్వెలిన్ ను విచారించగా తనకు సుకేష్ 1,50,000 డాలర్లు మాత్రమే పంపించాడని స్పష్టం చేసింది.
అంతేకాకుండా యుఎస్ఎ లో ఉన్న తన సోదరి గెరాలైన్ కీ 1,80,000 డాలర్లు పంపించాడని సుకేష్ మీడియా ముందు ఒప్పుకున్నాడు.