కరోనా ఈ రకంగా టాలీవుడ్‌ కు మంచే చేసింది

కరోనా వల్ల ప్రతి రంగం కూడా కుదేళయ్యింది.దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున నష్టం వాటిల్లింది.

 Tollywood Heros Back To Back Movie Next Two Years,latest Tollywood News-TeluguStop.com

ఇండియన్ సినిమా కూడా దాదాపుగా ఏడాదిన్నర పాటు పూర్తిగా నష్టపోయింది.అయితే ఈ సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ నష్టపోయింది ఎంతో కాని ప్రేక్షకులు లాభపడ్డారు అంటూ సోషల్‌ మీడియా వర్గాల వారు అంటున్నారు.

గడచిన పదేళ్లుగా తెలుగు సినిమా కు చెందిన స్టార్‌ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాల చొప్పున మాత్రమే చేస్తున్నారు.కాని ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

కరోనా గ్యాప్‌ లో ఒక్కో హీరో మూడు నాలుగు సినిమాల చొప్పున ఓకే చెప్పారు. పవన్‌ కళ్యాణ్ నుండి నాలుగు సినిమాలు ఇప్పటికే ప్రకటన వచ్చింది.

అల్లు అర్జున్‌ మూడు నాలుగు సినిమాలు చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Telugu Chiranjeevi, Tollywood-Movie

నాని వంటి యంగ్‌ హీరోలు వచ్చే ఏడాది మూడు నాలుగు ఆ తర్వాత తర్వాత కూడా వరుసగా సినిమాలను చేయబోతున్నట్లుగా ప్రకటించారు.మెగాస్టార్ చిరంజీవి నుండి మొత్తంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి.రవితేజ దాదాపుగా అరడజను సినిమాలు చేయబోతున్నాడు.

ఇలా టాలీవుడ్‌ స్టార్స్ అంతా కూడా వరుస సినిమాలను ప్రకటించారు.ఏడాది గ్యాప్ రావడంతో దాన్ని కవర్ చేయడానికి ఏడాదికి రెండు మూడు సినిమాలను చేయాలని భావిస్తున్నారు.

ప్రభాస్ అయితే వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతూనే ఉన్నాడు.ఇలా అందరు కూడా వరుస సినిమాలతో రెడీ అవుతున్న నేపథ్యంలో వచ్చే రెండు మూడు ఏళ్లు బాక్సాఫీస్ లు బద్దలు అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

టాలీవుడ్‌ ప్రేక్షకులకు పండుగ వాతావరణం ఖచ్చితంగా రాబోతుందని అభిమానులు మరియు మీడియా వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube