యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది.ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.
అంటే మూడు సంవత్సరాలకు పైగానే ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి బాగా తెలుసు.
అంతగా ఈ సినిమా గురించి జనాలు ఎదురు చూస్తున్నారు.భారీ పాన్ ఇండియా సినిమా గా రూపొందిన రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ ముగించి చాలా రోజులు అయ్యింది.
కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా వాయిదాలు పడుతున్న ఈ సినిమా ను ఎట్టకేలకు విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ఎప్పుడు వచ్చేది క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా టీజర్ ను 23 అక్టోబర్ న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.విక్రమాధిత్య ఎవరు అనే విషయాన్ని టీజర్ లో చూపించబోతున్నట్లుగా ప్రకటించారు.విక్రమాధిత్య అంటే ప్రభాస్ అయ్యి ఉంటాడా లేదంటే ప్రభాస్ అయ్యి ఉంటాడా అనేది చర్చ జరుగుతోంది.మొదట ప్రభాస్ లుక్ ను మరియు పాత్రను రివీల్ చేయాలి కనుక విక్రమాధిత్య అంటే ఖచ్చితంగా ప్రభాస్ అయ్యి ఉంటాడు అనేది ప్రతి ఒక్కరి నమ్మకం.
ఇక టీజర్ ను విడుదల చేసే నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలపై క్లారిటీ ఇవ్వబోతున్నారు.సంక్రాంతికి ఈ సినిమా విడుదల ఉంటుందా లేదా అనే విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ కు పూర్తి క్లారిటీ వచ్చినట్లయ్యింది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా ను నిర్మించారు.కృష్ణం రాజు ఈ సినిమా లో కనిపించబోతున్నాడు.తెలుగు మరియు హిందీ వర్షన్ ల్లో కొన్ని ముఖ్య పాత్రలకు గాను వేరే వేరు నటీ నటులను నటింపజేసినట్లుగా తెలుస్తోంది.
సినిమా పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది.ఇదో అద్బుతమైన పెయింటింగ్ మాదిరిగా ఉంటుందని మొదటి నుండి యూనిట్ సభ్యులు చెబుతున్నారు.