దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ తమిళనాట ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే మాస్టర్, ఉప్పెన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు తెలుగు ప్రేక్షక అభిమానులను కూడా సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ ఉన్న ఈ హీరో ఒక విషయంలో తన గొప్ప మనసును చాటుకుని ఏకంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
దక్షిణ భారత సినీ కార్మికుల సమైక్య (ఫెప్సీ) భవనాన్ని నిర్మించడం కోసం విరాళాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఈ భవన నిర్మాణానికి విజయ్ సేతుపతి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించడంతో అందరూ ఈ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం ఫెప్సీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రోజా భర్త సెల్వమణికి విజయ్ సేతుపతి కోటి రూపాయల చెక్కును అందించారు.
ఫెఫ్సీలో సభ్యులుగా ఉన్న కార్మికుల కోసం ఓ కాలనీ నిర్మించాలని సమాఖ్య ఎప్పట్నుంచో అనుకుంటుండగా ఈ భవనాన్ని నిర్మించడం కోసం సినీ ప్రముఖులు అందరిని తమ వంతు సహాయం చేయాలని ఫెప్సీ అధ్యక్షుడు సినీ ప్రముఖుల ను కోరారు.
ఈ క్రమంలోనే సెల్వమని విజ్ఞప్తి కోరికమేరకు ప్రసాద్ లాబ్ లో జరిగిన సమావేశానికి హాజరైన విజయ్ సేతుపతి ఆర్.కె.సెల్వమణికి ఈ చెక్కును అందించారు.కేవలం విజయ్ సేతుపతి మాత్రమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యు.వి.కమ్యూనికేషన్స్ అనే సంస్థ కూడా భవన నిర్మాణం కోసం 31 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించింది.ఈ సందర్భంగా విజయ్ సేతుపతి కోటి రూపాయల విరాళం ప్రకటించడంతో ఫెప్సీ అధ్యక్షుడు సెల్వమణి విజయ్ సేతుపతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక విజయ్ సేతుపతి విగ్నేష్ శివ దర్శకత్వంలో నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.