నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈమె సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తుందో, ఎవరికీ అర్థం కాదు కాకపోతే ఈమె ఇలా ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్స్ కాస్త సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పోసాని స్పందన.పోసాని స్పందనకు పవన్ అభిమానులు ప్రతిస్పందన చూస్తూనే ఉన్నాము.
ఈ క్రమంలోనే పోసాని ఓ సందర్భంలో మాట్లాడుతూ పంజాబీ అమ్మాయి అంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే పోసాని అన్న మాటలకు పంజాబీ అమ్మాయి పూనమ్ కౌర్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈమెని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై పూనమ్ స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.ఈ క్రమంలోనే ఈమె ట్వీట్ చేస్తూ ఇండస్ట్రీలో గురువుగారు అంటే దాసరి గారు ఒక్కటేనని ఆయన చాలా గుర్తొస్తున్నారు అంటూ బాగా ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసింది.
మరొక పోస్టులో అత్యాచార బాధితురాలు అంటూ పలు వీడియోలను షేర్ చేసింది.ఈ వీడియోలో భాగంగా తప్పు చేసిన వాడికి సిగ్గు ఉండాలి గాని నేనెందుకు సిగ్గు పడాలి అంటూ ఒక వీడియోను షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ మరొకసారి తన ట్వీట్ తో రెచ్చిపోయింది.అసలు ఈమె ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి ట్వీట్స్ చేస్తుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పూనమ్ ట్వీట్ చేస్తూ.ఒక్కోసారి ఓ అన్న గొప్పగా అనిపిస్తాడు.
మరో సారి ఇంకో అన్న గొప్పగా అనిపిస్తాడు ఈ సమాజంలో ఎవరి ఈగో వారు సంతృప్తి పరుచుకుంటారు తప్ప ఆడవాళ్ళ గురించి పట్టించుకునే వారు ఎవరూ లేరు.ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు అందరూ అలాంటి వాళ్లే మహిళలకు సపోర్ట్ చేసే వారు లేరంటూ ఈమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.