టాలీవుడ్లో బాహుబలి చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రానా దగ్గుబాటి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో రానా తాజాగా నటించిన అరణ్య చిత్రం రిలీజ్కు రెడీ అయ్యింది.
ఈ సినిమాలో రానా పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర పోస్టర్స్, టీజర్ చూస్తే అర్ధమవుతోంది.ఇక ఈ సినిమా తరువాత రానా చేయబోయే సినిమాలు కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతున్నాయట.
ఇప్పటికే విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్న రానా మరో హిస్టారికల్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు కథను విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాకు సింగన్న అనే టైటిల్ను చిత్ర యూనిట్ పెట్టాలని చూస్తుండగా, ఇందులో రానా ఓ వంటవాడిగా నటించనున్నాడు.శ్రీవెంకటేశ్వర స్వామి పరమ భక్తుడి కథను ఈ సినిమాలో మనకు చూపించనున్నారట.
కాగా ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో రానా ఎలా కనిపిస్తాడు, ఇందులో నటించే నటీనటులు ఎవరు అనే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా రానా నటిస్తు్న్న విరాటపర్వం చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే.అటు అరణ్య చిత్రాన్ని లాక్డౌన్ ముగియగానే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.