అమెరికాలో ఉన్న ఆటా తెలుగు సంఘం గతంలో కంటే కూడా ఇప్పుడు నూతన అధ్యక్షుడు భీంరెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త కార్యక్రమాలని నాంది పలికారు.ఆటా తెలుగు కమ్యునిటీ వారికోసం ఈ కొత్త కార్యక్రమాలు చేపట్టాలని ఆటా బోర్డు తీర్మానించింది.
అందుకు తగ్గట్టుగానే నార్త్ కరోలినాలోని ర్యాలీలో జరిగిన ఆటా బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఆటా తీసుకున్న సరికొత్త నిర్ణయాలు ఏమిటంటే.
అమెరికాలో ఉన్న తెలుగు వారికి అమెరికాలోని తెలుగు వారికి ఆటా స్టూడెంట్ స్కాలర్ షిప్స్ సర్వీస్ ప్రారంభించనున్నట్టుగా తెలిపారు.ఈ బోర్డ్ సమావేశంలోనే మ్యాట్రీమోనియాల్ సర్వీసెస్ని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నట్టుగా ఆటా అధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు.ఎన్నో సేవా కార్యక్రమాలు, పక్కా ప్రకాళిక తో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి ఎంతో ప్రాధ్యాన్యత సంతరించుకుంది.
1990 నుంచీ పెద్ద సంఖ్యలో అమెరికాకి వలస వచ్చిన తెలుగు వారి అవసరాలకి అనుగుణంగా ఆటా నూతన సేవా కార్యక్రమాలు రూపొందించినట్టుగా ఈ మీటింగ్ లో వెల్లడించారు.ఈ సేవ కార్యక్రమాలలో భాగంగానే తెలుగు వారికోసం మాట్రిమెనియాల్ సైట్ను, స్కాలర్ షిప్ ని ప్రారంభించారు భీంరెడ్డి.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అమెరికాలో చదువుతున్న 10 మంది తెలుగు వారి పిల్లలకి, ఒక్కొక్కరికి 1000 డాలర్లను స్కాలర్షిప్ కింద అందివ్వనున్నారు.