జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైయ్యాడు.బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు తన గురించి మరింతగా పరిచయం చేస్తున్నాడు.
ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ లో గత కొన్నేళ్లుగా స్కిట్స్ చేస్తున్నారు.అయితే అక్కడున్నపుడు కేవలం కమెడియన్గా మాత్రమే తెలుసు.
అయితే ఈయన జీవితంలో కూడా చాలా బాధలున్నాయి.కన్నీళ్లు దాగున్నాయి.
కష్టాలు మిగిలిపోయాయి.ఆ విషయాలని బిగ్ బాస్ వేదికగా తాజాగా చెప్పుకొచ్చారు.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ టైంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో సూసైడ్ చేసుకుందామని అనుకున్నానంటూ బిగ్ బాస్ హౌస్ లో బాంబ్ పేల్చాడు ముక్కు అవినాష్.జబర్దస్త్ కమెడియన్లకు చేతి నిండా డబ్బులు వస్తున్నాయి.వాళ్లకు అక్కడ రెమ్యునరేషన్ కూడా బాగానే వస్తుంటుంది కదా అనుకుంటున్నారా, నేను ఈ మధ్యే కొత్తగా ఇళ్లు కొన్నాను, దాని ఈఎంఐ నెలకు రూ.45 వేలు.అది కట్టలేని పరిస్థితిలో ఉన్నాను.అందరూ అనుకోవచ్చు.ఈఎంఐ కట్టలేనప్పుడు ఇళ్లు ఎందుకు కొన్నావ్ అని.కట్టగలను అనే నమ్మకం ఉంది కాబట్టే ఇళ్లు కొన్నాను కానీ అదే టైంలో నాన్నకి హార్ట్ స్టోక్ వచ్చింది.స్టంట్స్ పడ్డాయి.రూ.4 లక్షలు ఖర్చు అయ్యింది.
ఆ డబ్బు నేను ఇళ్లు కోసం దాచింది.
అప్పటికే ఇళ్లుకి అడ్వాన్స్ ఇచ్చేశాను.అదే టైంలో అమ్మకి మోకాళ్లు అరిగిపోయాయి.
దానికి కూడా డబ్బు అయ్యింది.అదే టైంలో ఇళ్లు తీసుకోవాల్సిరావడంతో బయట నుంచి రూ.13 లక్షలు అప్పు చేశాను అని చెప్పారు.నేను అప్పులు చేసింది మా అమ్మానాన్న కోసం, వాళ్లు బాగుండాలి అనుకున్నాను.
వాళ్లు బతికి ఉండగానే చూసుకోవాలి.ఉన్నప్పుడే కాపాడుకోవాలి అనుకున్నా అని తన భాదను చెప్పాడు.
ఇక ,ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చాడు.జబర్దస్త్ మొదలైన తర్వాత మళ్లీ ఈయన జీవితం కాస్త సాధారణంగా మారింది.
ఏదేమైనా ముక్కు అవినాష్ ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది.