సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా స్టార్ హీరోలు మంచి పేరు ఉన్న దర్శకులకు మాత్రమే అవకాశాలు ఇస్తుంటారు.ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న పరిస్థితి.
కొత్తగా ఏ దర్శకుడైన ఇండస్ట్రీలోకి అడుగు పెడితే తనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం చాలా అరుదని చెప్పవచ్చు.అయితే కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి కనుక కొందరు హీరోలు మాత్రం ఎంతో ధైర్యం చేసి ఆ దర్శకులకు అవకాశాలు ఇస్తుంటారు.
ఇలాంటి ఘటన లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న దాసరి నారాయణరావు కూడా ఎదురైందని చెప్పవచ్చు.
దాసరి నారాయణరావు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో శోభన్ బాబును దృష్టిలో ఉంచుకొని “తాతా మనవడు” కథను రాశారు.
ఈ సినిమాలో ఎస్ వి రంగారావు రాజబాబు నటించడంతో ఈ సినిమా ద్వారా వారికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.నిజానికి ఈ సినిమాలో రాజబాబు పాత్రలో శోభన్ బాబును ఊహించుకొని కథ సిద్ధం చేసుకున్నారు దర్శకుడు దాసరి.
అయితే దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి కొత్తగా రావడంతో అతనితో సినిమా చేయడానికి శోభన్ బాబు ధైర్యం చేయలేకపోయారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎస్ వి రంగారావు రాజబాబుతో దాసరి నారాయణరావు తెరకెక్కించారు.

ఈ సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అంతేకాకుండా ఈ సినిమాకు నంది అవార్డు రావడం గొప్ప విశేషమని చెప్పవచ్చు.ఈ విధంగా మొదటి సినిమాకి నంది అవార్డు దక్కించుకున్న దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.అయితే ఈ సినిమాలో నటించినందుకు గానూ శోభన్ బాబు ఎంతో ఫీలయ్యారని, ఆ తరువాత పలు సార్లు దాసరి నారాయణరావు కనిపించినప్పుడు తన దగ్గర ఇదే విషయాన్ని మాట్లాడేవారని, ఆ తర్వాత శోభన్ బాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి.