సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్గా నిలిచింది.మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలవడంతో మహేష్తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
కాగా మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కించనున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ కేమియో పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి వంశీ పడిపల్లి విజయ్ దేవరకొండకు స్క్రిప్టు వినిపించగా ఆయనకు నచ్చడంతో ఈ సినిమాలో గెస్ట్ పాత్ర చేసేందుకు రెడీ అయ్యాడు.
అయితే మహేష్ బాబుతో రౌడీ స్టార్ హీరో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం హాలీడేస్లో ఉన్న మహేష్, అతి త్వరలో ఈ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం వైజాగ్లో పలు లొకేషన్లు చూస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను వేసవిలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.