హైదరాబాద్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో( Mallareddy Agriculture University ) ఉద్రిక్తత నెలకొంది.ఒకటి, రెండు సబ్జెక్టులు ఉన్న సుమారు 60 మందిని డిటెయిన్డ్ చేశారని విద్యార్థులు ధర్నాకు దిగారు.
ఈ క్రమంలో మల్లారెడ్డి( Mallareddy ) దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేస్తున్న విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.మరోవైపు విద్యార్థులు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు సంఘీభావం తెలిపారు.