టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను, అతి తక్కువ సమయంలో బాలీవుడ్లో తన సత్తా చాటుతూ దూసుకెళుతోంది.తాజాగా ఆమె భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్లో నటిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ పోస్టర్తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది తాప్సీ పన్ను.
అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నిర్వహిస్తున్న టాక్ షో ‘వాట్ ఉమెన్ వాంట్స్ 2’లో తాప్సీ తన జీవితంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది.
గతంలో తాప్సీ కుటుంబ సభ్యులతో కలిసి గురుపౌర్ణమి రోజు గురుద్వారాకు వెళ్లేదని, అక్కడ జనం ఎక్కువగా ఉండే వారని ఆమె తెలిపింది.
గురుద్వారా బయట చిరుతిళ్లు అమ్మే బండ్లు ఉండేవని, అక్కడ రద్దీ ఉండటంతో ఆకతాయిలు అల్లరి చేసేవారని ఆమె తెలిపింది.ఒకరోజు తనను వెనకాల నుండి ఎవరో అసభ్యంగా మట్టుకోబోయారని, అది పసిగట్టిన ఆమె అతడి వేలిని విరిచేసి అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపారు.
ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని, అయినా ధైర్యంతో అతడి వేలు విరిచి అక్కడి నుండి వెల్లిపోయినట్లు తాప్సీ చెప్పింది.ఏదేమైనా తాప్సీ ధైర్యానికి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.
కాగా తాప్సీ మిథాలీ రాజ్ బయోపిక్తో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.