కోలీవుడ్ లో త్రిష పెళ్లి గురించిన చర్చ ఓ పది సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది.త్రిషకు గతంలోనే పలువురు హీరోలతో లింకులు ఉన్నాయని ముడిపెట్టి ఎవరికి వారు వార్తలు రాసుకున్నారు.
త్రిష పెళ్లి ఆ హీరోతో అయిపోతుందంటూ ఎప్పటికప్పుడు వార్తలు వండీ వార్చేసేవారు.ఇవేవీ నిజం కాలేదు.అయితే త్రిష పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ను పెళ్లాడేందుకు రెడీ అయ్యింది.2015లో వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.తర్వాత ఏం జరిగిందో కాని వీరిద్దరు మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
పెళ్లి తర్వాత నటించడానికి కుదరదని వరుణ్ చెప్పడం త్రిషకు నచ్చలేదని.
అందుకే వీరిద్దరు విడిపోయారన్న టాక్ వచ్చింది.అయితే ఇప్పుడు మళ్లీ త్రిష పెళ్లి వార్తలు బయటకు వస్తున్నాయి.
త్రిష – వరణ్ పెళ్లి ఆగిపోవడానికి ప్రధాన కారణం ఓ టాప్ హీరో అన్న ప్రచారం అప్పట్లో బయటకు వచ్చింది.ఇక త్రిష – శింబు పెళ్లి విషయం ఇప్పుడు కూడా కోలీవుడ్ మీడియా పదే పదే హైలెట్ చేస్తూ వస్తోంది.
తాజాగా ఈ అంశంపై శింబు తండ్రి టి.రాజేందర్ను మీడియా ఇదే అంశంపై స్పందిస్తూ పదే పదే త్రిష, శింబుల పెళ్లి గురించి ఎందుకు ? అడుగుతారంటూ ఫైర్ అయ్యారు.శింబు మాత్రం గత కొంత కాలంగా తన షార్ట్ టెంపర్ మాత్రం వదులుకుని చాలా కూల్గా ఉండడంతో పాటు టైంకు షూటింగ్లకు వచ్చేస్తున్నాడట.
ఇప్పుడిప్పుడే శింబు కెరీర్ ట్రాక్లోకి వస్తోంది.
ఈ మార్పునకు ప్రధాన కారణం త్రిషయే అని.అందుకే లాక్డౌన్ టైంలో గౌతమ్ మీనన్ షార్ట్ ఫిల్మ్లో కూడా వీరిద్దరు కలసి నటించారని కోలీవుడ్ మీడియా రాస్తోంది.ఏదేమైనా ఈ జంట మళ్లీ ఒక్కటి కావడంతో వీరి అభిమానులు సంబర పడుతున్నారు.మరీ ఇప్పటకి అయినా వీరు పెళ్లి చేసుకుంటారేమో ? చూడాలి.