టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు.సందీప్ కిషన్ కు వేంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.
కరోనా తర్వాత ఏ1 ఎక్సప్రెస్సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరొకసారి పలకరించాడు.ఈ సినిమా పర్వాలేదనిపించింది.
ప్రస్తుతం సందీప్ కిషన్ గల్లీ రౌడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్, ఎం వివి సినిమా పథకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ కామెడీ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు.ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తుంది.ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు.
అయితే ఈ మధ్య సందీప్ కిషన్ చేసే సినిమాలన్నీ వైవిద్యంగా ఉంటున్నాయి.
తాజాగా సందీప్ కిషన్ ఒక పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు.మైఖేల్పేరుతొ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఇందులో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేస్తుండగా కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ లో కనిపించ బోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఈ రోజు నిర్మాత సునీల్ నారంగ్ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ పోస్టర్ లో సందీప్ కిషన్ చొక్కా చేతులు రక్తంతో తడిచి ఒక చేతికి సంకెళ్లు వేయగా.మరొక చేతిలో బ్రాస్ ని పట్టుకుని ఉన్నాడు.ఈ సినిమాను రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్నాడు.మరి ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైఖేల సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ముందు ముందు చూడాలి.మరి ఇప్పుడు విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.