ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశం లో వివిధ వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు తమను ఆహ్వనించలేదని మరికొందరు తమకు సముచితమైన స్థానం కేటాయించలేదని బహాబహికి దిగారు.గత కొన్నిరోజులుగా టి-కాంగ్రెస్ లో ఆధిపత్య పోరుకు ఈ రోజు సమీక్ష సమావేశాలు అద్దం పట్టాయి.
జానారెడ్డి, డిఎస్,పొన్నాల కు చెందిన కార్యకర్తలు ఈ గొడవకు కారణంగా తెలుస్తుంది.ఈ సమీక్ష సమావేశాలలో పార్టీ వోటమి గల కారణాలని విశ్లేశించి వచ్చే ఎన్నికలలోపు పార్టి ని పటిష్టం చేసేందుకు చేయాల్సిన కార్యకలాపాలను చర్చిస్తున్నారు.
వచ్చే జియచ్ఏంసి ఎన్నికలని కూడా దృష్టిలో పెట్టుకొని అనుసరించాల్సిన మార్గాలని, కార్యకర్తలని ఒక్కతాటి పై నడిపీ విధంగా లోకల్ క్యాడర్ని తయారుచేసేవిధంగా తగిన ప్రణాళికలను తయారుచేస్తున్నారు.