పుట్టింట 500 ఆవులు, గేదెలు, విలాసవంతమైన ఇల్లు కలిగిన రబ్రీ దేవి( Rabri Devi ) సామాన్య జీవితం గడుపుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ను( Lalu Prasad Yadav ) ఎలా వివాహం చేసుకున్నారనే విషయాన్ని సంతోష్ సింగ్ తన పుస్తకం ‘కిత్నా రాజ్ కిత్నా కాజ్’లో పేర్కొన్నారు.ఒక పెద్ద కుటుంబంలోని కుమార్తెతో లాలూ యాదవ్ వివాహం ఎలా జరిగిందనే సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం.
పుస్తకం ప్రకారం మాజీ సీఎం రబ్రీదేవి తండ్రి శివప్రసాద్ చౌదరి ప్రభుత్వ కాంట్రాక్టర్.అతను పశ్చిమ చంపారన్లోని బెట్టియా, భైంసలోటన్లో వంతెనలను నిర్మించాడు.
ప్రజాపంపిణీ వ్యవస్థ అంటే పీడీఎస్ విధానం అమలులోకి వచ్చాక అతనికి పెద్ద ఉద్యోగం వచ్చింది.శివప్రసాద్ చౌదరి( Sivaprasad Chaudhary ) తన గ్రామమైన సెలార్ కాల సమీపంలోని 38 గ్రామాల్లో రేషన్ ధాన్యాలు, చక్కెర, గడ్డి పంపిణీ చేసేవాడు.
రబ్రీ దేవి కుటుంబం మొదటి నుండి సంపన్నమైనది.పలుకుబడి కలిగినది.ఆమె తండ్రిని సెలార్ కాలా ప్రాంతంలోని అందరూ గౌరవించేవారు.1934లో ఆమె కుటుంబానికి రెండంతస్తుల పక్కా ఇల్లు ఉందంటే రబ్రీ దేవి కుటుంబం గొప్పదనాన్ని అంచనా వేయవచ్చు.దీనికి పక్కా పైకప్పు, చెక్క పట్టీలు కూడా ఉన్నాయి.పుస్తకం ప్రకారం, లాలూ యాదవ్ బావమరిది సాధు యాదవ్కు కూడా ఆ ఏరియాలో బ్రహ్మాండమైన ఇల్లు ఉండేది.
ఒకప్పుడు రబ్రీదేవి ఇంటి తలుపుల మీద బంగారు తాపడం ఉండేది.లాలూ యాదవ్ను రబ్రీ దేవి వివాహం చేసుకున్నప్పుడు లాలూ యాదవ్ పేదవాడు.
కానీ రబ్రీ దేవిది పలుకుబడి కలిగిన కుటుంబం.ఆ సమయంలో రబ్రీ దేవి ఇంట్లో 500 ఆవులు, గేదెలు ఉండేవి.పశ్చిమ బెంగాల్లోని జగత్దళ్లో ఒక గోశాల కూడా ఉంది.రబ్రీ దేవి చదువులో ప్రత్యేకంగా ఏమీ చదవలేదు.5వ తరగతి తర్వాత చదువు మానేశారు.నిజానికి ఆమె చదివే పాఠశాల వారి ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండేది.
అందుకే చదువు మానేయాల్సి వచ్చింది.రబ్రీ తండ్రి ఆమె కోసం అబ్బాయి కోసం వెతుకుతున్నాడు.
ఇంతలో, సెలార్ కాలా, ఫుల్వారియా ( Celar kala, Fulvaria )మధ్య ఉన్న మాదిపూర్ గ్రామ అధిపతి, పాట్నాలో చదువుతున్న ఒక అర్హతగల అబ్బాయి గురించి చౌదరికి చెప్పాడు.ఆ అబ్బాయి పేరు లాలూ ప్రసాద్ యాదవ్.లాలూ యాదవ్ ఆ రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు.1970లో పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యారు.అతని పాపులారిటీ పెరుగుతూ వచ్చింది.రబ్రీ దేవి తండ్రి తన కూతురిని సంపన్న ఇంట్లో పెండ్లి చేసి ఉండవచ్చు.అయితే లాలూ యాదవ్ వ్యక్తిత్వం ఆయనకు నచ్చింది.జూన్ 1, 1973న 5 బిఘాల భూమి, 5 ఆవులను ఇచ్చి లాలూ యాదవ్కు తన కుమార్తె రబ్రీ దేవితో వివాహం చేశారు.