ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా భారీ విజయాన్ని సాధించి దూసుకుపోతోంది.కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది రాదే శ్యామ్ సినిమా.
పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా అదే రేంజ్ లో సత్తా చాటింది.ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు.
ఇక అయితే ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ రాధేశ్యామ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.
భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపే కలెక్షన్స్ తో అదరగొట్టింది.
ఇక ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాక్సాఫీస్ దగ్గర బాగా రాణించగా.ఆంధ్ర లో మాత్రం టికెట్ రేట్ కారణంగా కాస్త తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ పుష్ప సినిమాల కలెక్షన్స్ కంటే అటు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కలెక్షన్స్ ఎక్కువ సాధించింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 16.20 కోట్ల రాబడితే భీమ్లా నాయక్ 19.8 కోట్లు వసూళ్లు సాధించింది.ఇక రాదే శ్యామ్ కు మాత్రం 23.14 కోట్ల వసూళ్లు రావడం గమనార్హం.
ఓవరాల్గా పుష్ప మొదటిరోజు 22 కోట్ల నుంచి 24 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తే భీమ్లా నాయక్ మొదటి రోజు 26 కోట్లు నుంచి 27 కోట్ల వరకు షేర్ సొంతం చేసుకుంది.ఇటీవలే రాధేశ్యాం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం 46 నుండి 47 కోట్ల వరకు వసూలు అందుకోవడం గమనార్హం.అయితే భీమ్లా నాయక్ పుష్ప సినిమాలు విజయవంతమైనప్పటికీ రాదేశ్యామ్ మాత్రం అంతకుమించిన విజయంతో భారీ వసూళ్లు సాధించింది.దీంతో ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.
ఎన్ని రోజులనుంచి ప్రభాస్ అభిమానులందరూ సినిమా కోసం ఎదురుచూస్తుండగా ఇక రాదే శ్యామ్ సాలిడ్ హిట్ అయ్యింది.