పూరీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్నాడా..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

 Puri Jagannadh To Make An International Project,international Project, Vijay Dev-TeluguStop.com

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ కూడా చాలా కష్ట పడుతున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ ను మేకర్స్ విజయ వంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయ బోతున్నారు.

ఈ సినిమా పూర్తి అవ్వడంతో పూరీ జగన్నాథ్ గ్యాప్ లేకుండా వెంటనే తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసేసాడు.పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసాడు.జనగణమన ను పూరీ స్వయంగా ప్రకటించాడు.

పూరీ కనెక్ట్స్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో చేయ బోతున్నాడు.లైగర్ లాగా జన గణమన కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది.

అయితే ఈ సినిమాలో కూడా విజయ్ నే హీరోగా నటిస్తున్నాడు.దీంతో ఈ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది.

తాజాగా పూరీ నెక్స్ట్ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.పూరీ జగన్నాథ్ జనగణమన తర్వాత ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్నాడు.ఈ ప్రాజెక్ట్ వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు కానీ అంతర్జాతీయ ప్రాజెక్టు కూడా పూరీ కనెక్ట్స్ బ్యానర్ పైనే రూపొందనుందట.ఛార్మి కౌర్ కూడా కూడా ఇందులో భాగం కానున్నదని సమాచారం.

ఈ రెండు ప్రోజెక్టుల స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడంపై పూరీ ఇప్పుడు ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube