టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్.ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా యు.వి.క్రియేషన్స్ నిర్మించాయి.వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టే పనిలో పడింది చిత్రబృందం.ఈ నేపథ్యంలోనే తాజాగా గురువారం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ.
నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది.ఎందుకంటే ఇక్కడ మీరు చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉంది.
ఈ సినిమాను నాలుగేళ్లపాటు షూట్ చేశాం.ఈ సినిమా కోసం మా చిత్ర బృందం అందరూ కూడా ప్రాణం పెట్టి మరీ పని చేశాము.
ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను.అలాగే ఇంత భారీ సినిమాలు నిర్మించినందుకు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లినందుకు మా నిర్మాతలకు థ్యాంక్స్.
వారికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ఉంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.డైరెక్టర్ రాధాకృష్ణ సార్ ఐదేళ్ల పాటు ఒకే సినిమా మీద వర్క్ చేయడం, ఒకే కథ పట్టుకొని ఉండటం అన్నది మామూలు విషయం కాదు.
ఈ ఐదేళ్లలో అతను ఒకటే ఎక్సైట్ మెంట్ తో కనిపించారు.హీరోయిన్ గా నేను ఆ సినిమాలు ఈ సినిమాలు అంటూ తిరిగి వచ్చే దాన్ని.కానీ దర్శకుడు అలా కాదు ఇలాంటి ఫ్యాషన్ పిచ్చి ఉన్న దర్శకుడి ని నేను ఇంత వరుకు చూడలేదు అంటూ దర్శకుడి పై ప్రశంసల వర్షం కురిపించింది.నేను కథ విన్న వెంటనే ఓకే చెప్పిన సినిమాలు చాలా అరుదుగా ఉన్నాయి.
కానీ రాధేశ్యామ్ సినిమా కథ వినగానే వెంటనే ఓకే చెప్పేశాను.అద్భుతమైన ప్రేమ కథ.ఇందులో కొన్ని మూమెంట్ చాలా అద్భుతంగా ఉంటాయి.ఈ సినిమా తెరపైకి వస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు.
ఇది ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.