ములుగులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హజరై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.
బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్లముందే ప్రారంభమైందన్న కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల సాధన కోసమని పేర్కొన్నారు.గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కరెంట్, నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డామన్నారు.
యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో? ప్రజలే ఆలోచన చేయాలని చెప్పారు.బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామన్నారు.పెన్షన్లను దశల వారీగా రూ.5 వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.