జనావాసాల్లోని ఇళ్లలో అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పడం కష్టం.చుట్టు పక్కల వాళ్లు నీళ్లు పోసినా మొత్తం కాలి బూడిద అవుతుంది.
ఇక ఫైరింజన్ వచ్చేపాటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.జనావాసాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక అడవుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అమెజాన్ వంటి అడవులలో కొన్ని వందల ఎకరాలలో గతంలో అడవులు దగ్ధం అయ్యాయి.వాటిని ఆర్పాలంటే సాధ్యమయ్యే పని కాదు.
అందుకే బ్రెజిల్ వంటి దేశాలు చేతులెత్తేశాయి.ఇలాంటి పరిస్థితి రాకుండా శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు.
క్షణాల్లోనే మంటలన్నీ ఆర్పేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే టెక్నాలజీ తయారు చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇటాలియన్ ద్వీపం సార్డినియాలో, 2021లో అడవి ప్రాంతం అంతా మంటల వల్ల నాశనమైంది.మళ్లీ అదే రకమైన విపత్తు సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ‘అల్ట్రా-ఎర్లీ వైల్డ్ఫైర్ డిటెక్షన్ సెన్సార్’ల శ్రేణి ప్రయోగిస్తున్నారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతను ఉపయోగించే సెన్సార్లు, సెల్యులార్ కవరేజ్ అవసరం లేకుండా పనిచేసే సెన్సార్లు, మంటలు పూర్తిగా పట్టుకోకముందే గ్యాస్ను గుర్తించేందుకు చెట్లపై అమర్చబడి ఉంటాయి.
అగ్నిమాపక సేవల యొక్క ప్రతిచర్య సమయాన్ని క్లిష్టమైన మొదటి గంటలోపే తగ్గించడం లక్ష్యం.దీనిని స్మార్ట్ ఫారెస్ట్గా భావించండని వోడాఫోన్ బిజినెస్లో ఐఓఠీ, క్లౌడ్ స్పెషలిస్ట్ అయిన రూబెన్ కింగ్స్ల్యాండ్ అన్నారు.ఆ సెన్సార్లు అడవిలో ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, అడవి అంచున ఉండే గేట్వే అయిన దీనికి తిరిగి కనెక్ట్ అవుతాయని వెల్లడించారు.
ఇక్కడ చేసిన డిటెక్షన్లు చాలా ముందుగానే స్మోల్డరింగ్ దశలో ఉన్నాయన్నారు.గంటలు లేదా రోజులలో కాకుండా నిమిషాల వ్యవధిలో మంటలను గుర్తించవచ్చని ఆయన పేర్కొన్నారు.