టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ కలిగిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్టు అయ్యి దాదాపు నెలరోజులు కావస్తుంది.
మరో పక్క బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో లోకేష్ ( Lokesh )కూడా ఢిల్లీలో పెద్దపెద్ద లాయర్లను రంగంలోకి దింపుతున్నారు.
అయినా గాని ఇప్పటివరకు బెయిల్ దొరకలేదు.వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా చంద్రబాబుకి బెయిల్ రాకపోవడంపై మంత్రి కొట్టు సత్యనారాయణ( Minister Kottu Satyanarayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే వ్యవస్థలను మేనేజ్ చేసే సత్తా ఉన్నాగాని బెయిల్ దొరకటం లేదని అన్నారు.
శనివారం కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లిలో పర్యటనకు విచ్చేసిన కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.చంద్రబాబు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు కూడా అవుతుందన్నారు.
లోకేష్ కి ఉత్తర ప్రగల్బాలు పలకటం తప్ప విషయ పరిజ్ఞానం లేదని కొట్టు సత్యనారాయణ వ్యంగంగా విమర్శించారు.