తిరుపతి: గోశాలల నిర్వహణ,గో ఆధారిత వ్యవసాయంపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలో శిక్షణా కార్యక్రమాలు: టిటిడి ఈవో కెఎస్.జవహర్ రెడ్డి

గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో యువ రైతులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఆదివారం గోశాల నిర్వాహకులతో ఈఓ సమావేశం నిర్వహించారు.

 Tirupati: Statewide Training Programs On Gosha Management And Go Based Agricultu-TeluguStop.com

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు గోశాలల్లో 2500 గోవులు మిగులుగా ఉన్నాయని, వీటిని జూన్ నెలలోగా అవసరమైన రైతులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రూపొంది0చాలని ఈవో అన్నారు.నోడల్ గోశాలల్లో ఉన్న గోవుల ఆరోగ్యాన్ని పరీక్షించడం, గోవులకు అవసరమైన మేత, రైతులకు అందించేందుకు రవాణ ఛార్జీల కోసం ఆర్థిక సహాయం తదితర అంశాల పై చర్చించారు .తిరుపతిలో ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని గోశాల నిర్వాహకులు ఈఓకు తెలియజేశారు.శ్రీకాళహస్తిలోని గోశాలలో మే రెండో వారంలో శిక్షణ కార్యక్రమం జరుగనుందని వారు ఈఓకు తెలిపారు.

ప్రతి గోశాలలో ఒక్కో రకమైన నైపుణ్యం ఉందని, వాటిని ఉపయోగించుకొని చక్కటి పంచగవ్య ఉత్పత్తులు తయారు చేయవచ్చని వివరించారు.

ఈ సమావేశంలో తిరుపతి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఆచార్య వెంకట నాయుడు, గోశాల నిర్వాహకులు శ్రీ శశిధర్, శ్రీ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube