మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో భోళా శంకర్ సినిమా కూడా ఉంది.ఇది తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం సినిమాకు అఫిషియల్ రీమేక్.
మెహర్ రమేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.ఈ సినిమా స్రిప్ట్ ను మెహర్ రమేష్ రెడీ చేసి మెగాస్టార్ డేట్స్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ ఉన్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మెహర్ రమేష్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత చిరుతో కలిసి భోళా శంకర్ సినిమాను తెరకెక్కించే అవకాశం వచ్చింది.చిరంజీవి మెహర్ రమేష్ కు పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు.
ఇప్పటి వరకు సరైన హిట్స్ లేక మెహర్ రమేష్ కు అవకాశాలు రాలేదు.దీంతో వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎలాగైనా సక్సెస్ కొట్టాలని మెహర్ రమేష్ ప్రయత్నిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు మెహర్ రమేష్ పారితోషికం తీసుకోవడంలేదని వార్తలు వస్తున్నాయి.కానీ జీతం రూపంలో తీసుకుంటున్నాడని తెలుస్తుంది.ఈ సినిమాకు మెహర్ రమేష్ నెలకు 5 లక్షలు తీసుకుంటున్నాడట.ఈ సినిమా పూర్తయ్యే వరకు నెల జీతానికే పనిచేస్తున్నట్టు టాక్.ఈ సినిమాను 2020 సెప్టెంబర్ లోనే పనులు స్టార్ట్ చేసారు.ఇక అప్పటి నుండే మెహర్ రమేష్ జీతం అందుకుంటున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా పూర్తి అయ్యేటప్పటికి మరొక సంవత్సరం అయినా అపడుతుంది.ఇప్పటికే 60 లక్షల జీతం అందుకున్న మెహర్ రమేష్ ఇంకా ఏడాది పాటు నెల జీతం అందుకోబోతున్నాడు.ఇక జీతం మాత్రమే కాదట విడుదల అయినా తర్వాత 20 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.మొత్తానికి మెహర్ రమేష్ 8 ఏళ్ల గ్యాప్ తర్వాత తీసే సినిమాకు దాదాపు 2 కోట్ల వరకు అందుకోబోతున్నాడు.
ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.