మీడియా మేనేజ్మెంట్లో ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసినన్ని కిటుకిలు ఎవ్వరికి తెలియవు అన్న చర్చలు ఏపీలో ఎప్పటి నుంచో ఉన్నాయి.ప్రస్తుతం తెలుగు మీడియా రంగంలో ఉన్న అధినేతలందరిని ఆయన గ్రిప్లో పెట్టుకుని తన పార్టీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయడంలో ఆయనకు తెలుగు రాజకీయ నాయకులు ఎవ్వరూ సాటిరారన్నది తెలిసిందే.
అయితే రాష్ట్ర విభజనతో చంద్రబాబు హవా ఏపీకే పరిమితమైంది.ఆయన మీడియాను కంట్రోలింగ్ చేసినా మానిటరింగ్ చేసినా అది అక్కడి వరకే పరిమితమవుతోందా ? తెలంగాణ మీడియా విషయంలో చంద్రబాబు పప్పులు ఉడకడం లేదా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి.ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది.
తెలంగాణలో కేసీఆర్ సీఎం అయిన వెంటనే రెండు ప్రముఖ మీడియా సంస్థల ప్రసారాలను కట్ చేయించి వాళ్లను కేసీఆర్ ఎలా దారిలోకి తెచ్చుకున్నాడో తెలిసిందే.
ఏపీలోను ఓ మీడియా ఛానెల్ను చంద్రబాబు కొద్ది రోజులు టార్గెట్ చేశారన్న వాదన కూడా ఉంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ మీడియాలో టీడీపీకి అస్సలు ప్రాధాన్యత ఉండడం లేదని తెలుస్తోంది.
అక్కడ టీడీపీకి రోజు రోజుకు ఎలా క్రేజ్ తగ్గుతోందో ? మీడియాలోను ప్రయారిటీ బాగా తగ్గిపోతోంది.రేవంత్రెడ్డి లాంటి ఒకరిద్దరికి మినహా తెలంగాణ టీడీపీ నేతలు చేసే ప్రకటనలు, కార్యక్రమాలకు అసలు మీడియాలో ఏ మాత్రం ప్రాధాన్యత రావటం లేదు.
ఈ విషయంలో తెలంగాణ టీడీపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ వరకు టీడీపీకి చెందిన నాయకులు చెప్పిన వార్తలు మీడియాలో ఎప్పుడైనా వచ్చినా ప్రభుత్వానికి మరీ వ్యతిరేకంగా ఉన్న అంశాలను తొలగించి…అలా లైట్ గా వదిలేస్తున్నారు.
ఎక్కడైనా ప్రతిపక్షాల నాయకుల వాయిస్కు మీడియా ప్రముఖంగా ప్రాధాన్యత ఇవ్వాలి.కానీ తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఈ విషయంలో టీడీపీ నాయకులు మరీ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
టీడీపీకి అక్కడ ఇంత దారుణమైన పరిస్థితి రావడం వెనక ప్రభుత్వ ఒత్తిళ్లు మీడియా సంస్థలపై గట్టిగా ప్రభావం చూపుతున్నాయన్న సందేహాలను టీడీపీ సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీడీపీ రాష్ట్ర నాయకుల పరిస్థితే ఇలా ఉంటే జిల్లాల్లో అయితే మరీ దారుణంగా ఉందట.