మహేష్ బాబు ఏడాదిలో ఒక్క సినిమా చేయడమే చాలా గొప్ప విషయం.అలాంటిది ఆరు సినిమాలు ఎలా చేస్తాడు అనే కదా మీ అనుమానం.
హీరోగా కాదులేండి.నిర్మాతగా మహేష్బాబు వరుసగా చిత్రాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఇప్పటికే మహేష్బాబు పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు.పలు సినిమాలకు సహాయ నిర్మాతగా మహేష్ వ్యవహరించాడు.
ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం నిర్మాణంలో కూడా మహేష్ బాబు వాటా ఉంది.
ఇతర హీరోలతో కూడా మహేష్ బాబు నిర్మాణ సంస్థ సినిమాలు చేయబోతుంది.
అందులో భాగంగా మొదటి సినిమాను మేజర్ టైటిల్తో అడవి శేషు హీరోగా తెరకెక్కించారు.ఆ సినిమా మాత్రమే కాకుండా రెండు నుండి అయిదు కోట్ల బడ్జెట్తో నాలుగు సినిమాలను నిర్మించేందుకు నమ్రత చర్చలు జరుపుతున్నారట.
కొత్త వారితో మంచి కథతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలను తెరకెక్కించేందుకు కథలు వింటున్నారట.
మహేష్బాబు పేరుతో వచ్చే సినిమాలకు మంచి పేరు ఉంటుంది.ఖచ్చితంగా పెట్టుబడికి డబుల్ వచ్చే అవకాశం ఉంది.అందుకే ఎలాంటి అనుమానాలు లేకుండా పెద్ద ఎత్తున సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు.
వచ్చే ఏడాదిలో కనీసం మూడు నాలుగు సినిమాలు అలాగే రెండు వెబ్ సిరీస్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో నమ్రత అండ్ టీం పని చేస్తున్నారట.ఈ విషయంపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉంది.